తుమ్మలపల్లి నూతన దేవాలయానికి గౌరు వెంకటయ్య- లలిత దంపతుల వినాయక విగ్రహ బహూకరణ.

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ శ్రీ ఆంజనేయ స్వామి నవగ్రహ ధ్వజ నాభి శిలా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం సందర్భంగా గౌరు వెంకటయ్య- లలిత దంపతులు దేవాలయానికి వినాయక విగ్రహాన్ని బహుకరించడం జరిగింది.ఈ సందర్భంగా గౌరు వెంకటయ్య లలిత దంపతులు మాట్లాడుతూ.
తుమ్మలపల్లి గ్రామంలో ఈ విధంగా దేవాలయ నిర్మాణము విగ్రహ ప్రతిష్ట మరియు బొడ్రాయి మహోత్సవ కార్యక్రమం జరుపుకోవడం తమ కు చాలా ఆనందదాయకంగా ఉందని శ్రీ సీతారామ లక్ష్మణ శ్రీ ఆంజనేయ స్వామి కృపాకటాక్షాల వల్ల తుమ్మలపల్లి గ్రామ పరిసరాలలో వర్షాలు విస్తారంగా కురిసి పాడిపంటలతో గ్రామం విలసిల్లాలని భగవంతుని మనసారా కోరుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు