పెళ్లి రోజు సందర్భంగా 12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమతను ఘనంగా సన్మానించిన మహిళలు

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

సదాశివపేట పట్టణంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి మమత రాజు దంపతుల పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దంపతులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు.

పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పులిమామిడి మమత రాజు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులు ఇలాగే ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

వేడుకల్లో పాల్గొన్న అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయగా, కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. అభిమానులు పూలమాలలు వేసి దంపతులను సన్మానించారు. ఈ వేడుకలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు