హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తాళ్ల మండవాలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. గొడిశాల విజయ్ కళ్యాణ్పై అక్కినపల్లి అఖిల్ కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో విజయ్ కళ్యాణ్ తీవ్రంగా గాయపడి రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Post Views: 55









