బడంగ్ పేట్ సర్కిల్:
ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితమైన కుటుంబ వివరాలు సేకరించి ప్రజలకు జనగణన ప్రాముఖ్యతను వివరించాలని శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ అధికారులకు సూచించారు.సోమవారం రోజు ఇంటింటికి వెళ్లి జనగణన విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లు,ఎన్యుమరేటర్ల పని తీరును బడంగ్ పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తో కలిసి ఆమె పరిశీలించారు.జనగణన ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని డిసి సమ్మయ్య అధికారులకు సూచించారు. జనగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని అధికారులు అడిగే వివరాలను అందజేయాలని కోరారు.
Post Views: 8









