ట్రంప్ షాకింగ్ నిర్ణయం: పాకిస్థాన్ పర్యటన రద్దు.. ఇరాన్‌కు కఠిన హెచ్చరికలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు పంపాలనుకున్న తన ప్రతినిధుల పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరాన్‌తో శాంతి చర్చలు జరపడానికి జారెడ్ కుష్నర్ మరియు స్టీవ్ విట్కాఫ్ ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది, కానీ “మేము ఎక్కడికో వెళ్లి చర్చలు జరపాల్సిన అవసరం లేదు, మా దగ్గరే అన్ని పవర్స్ (cards) ఉన్నాయి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 18 గంటల పాటు ప్రయాణించి ఏమీ తేలని చర్చల కోసం వెళ్లడం సమయం వృధా అని ఆయన స్పష్టం చేశారు.

అదే సమయంలో ఇరాన్ నాయకత్వంపై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్ నాయకత్వంలో గందరగోళం నెలకొందని, అసలు అక్కడ ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఇరాన్‌కు చర్చలు జరపాలని ఉంటే వారే నేరుగా ఫోన్ చేయవచ్చని, అంతేకానీ తాము వారి దగ్గరకు వెళ్లబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధ నియంత్రణ మరియు మధ్యప్రాచ్యంలో శాంతి విషయంలో ఇరాన్ తన పంథా మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ పరిణామం పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం అమెరికా తన పట్టును సడలించబోమని సంకేతాలిస్తుండగా, మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు