వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము వరంగల్.

ప్రచురణార్థం

సమస్త రైతు సోదరులకు, అడ్తిదారులకు, ఖరీదుదారులకు మరియు హమాలి గుమస్తా కార్మిక సోదరులకు తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతము ఎండల తీవ్రత అధికముగా ఉన్నందున సరుకుల వేలం పాట సమయములు దివి:23-04-2026 గురువారము నుండి ఈ క్రింది విధంగా మార్చడమైనది.

  • మిర్చి బీటు : ఉదయం గం”7-05 ని.లకు
  • పత్తి బీటు : ఉదయం గం”8-05 ని.లకు
  • పల్లికాయ బీటు : ఉదయం గం”8-15 ని.లకు
  • పసుపు బీటు : ఉదయం గం”8-30 ని.లకు
  • అపరాలు, ధాన్యం బీటు : ఉదయం గం”8-45 ని.లకు.

    మరియు ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరంగల్ గ్రేన్ మార్కెట్ గుమస్తా సంఘం వారి కోరిక మేరకు *దివి:22-04-2026 నుండి వచ్చే ప్రతి బుధవారం* మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించనైనది

కావున రైతు సోదరులు ఇట్టి విషయాన్ని గమనించి తమ సరుకులను బందు రోజులో తెచ్చి ఇబ్బంది కావద్దని కోరనైనది.

ఇట్లు
వ్యవసాయ మార్కెట్ కమిటీ
వరంగల్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు