అంబేద్కర్ ఆశయాల సాధనకే తమ కట్టుబాటు అని మరోసారి చాటి చెప్పింది బీజేపీ నాయకత్వం. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ప్రముఖ నేత కె. లక్ష్మణ్ గారి నేతృత్వంలో బషీర్బాగ్ నుంచి ట్యాంక్బండ్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో భారీగా కార్యకర్తలు, నాయకులు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగుతామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.
Post Views: 12









