బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో మహత్ రాఘవేంద్ర మళ్లీ టాలీవుడ్కు రీఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో మంగాత, జిల్లా, చెన్నై 28 పార్ట్ 2 వంటి విజయవంతమైన సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మహత్, హిందీలో డబుల్ ఎక్స్ ఎల్ వంటి చిత్రాల్లో నటించి తన నటన వైవిధ్యాన్ని చూపించారు. ఈ ప్రయాణం తర్వాత కొత్త లుక్తో తిరిగి తెలుగులోకి రావడం ఆయన అభిమానులను ఉత్సాహపరచుతోంది.
తన కెరీర్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతోందని చెప్పుకుంటున్న మహత్ రాఘవేంద్ర, తాజాగా చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్తో ఫిట్నెస్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యూ లుక్లో ఆయన కనిపించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ మార్పు ఆయన టాలీవుడ్ రీ ఎంట్రీకి మరింత హైప్ తీసుకొచ్చింది.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్తో కలిసి మహత్ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. కథ తనకు చాలా నచ్చిందని, ముఖ్యంగా తన రీ ఎంట్రీకి ఇది సరైన ప్రాజెక్ట్ అవుతుందని మహత్ పేర్కొన్నారు. కథలో భావోద్వేగాలు, వినోదం, కొత్త కోణాలు ఉంటాయని తెలిపారు. ఈ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు రావడం తనకు చాలా హ్యాపీగా ఉందని ఆయన అన్నారు.
తెలుగు ప్రేక్షకులు ఇప్పటిదాకా ఇచ్చిన ప్రేమ, ఆదరణ ఎప్పుడూ తనకు గుర్తే అని, ఈ రీ ఎంట్రీ సినిమాకూ అదే ప్రేమ అందుతుందని మహత్ ఆశిస్తున్నారు. టాలీవుడ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమని, ఇక్కడ మళ్లీ ఒక మంచి స్థానం సంపాదించేందుకు ఎంతో కృషి చేస్తున్నానని చెప్పారు. కొత్త జోష్, కొత్త లుక్, కొత్త కథతో మహత్ రాఘవేంద్ర ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.









