నిడమనూరు మండలం లోని నారమ్మ గుడె గ్రామంలో ఏర్పాటు చేసిన సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతుతో, సక్రమంగా విక్రయించేందుకు ఈ కేంద్రాలను ఉపయోగించడం ముఖ్యమని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ద్యేయమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధరతో ధాన్యం విక్రయించడానికి అవకాశం లభించనుండటం రైతులను ప్రోత్సహిస్తుంది. కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడిచే విధంగా, తేమ శాతం ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం తీసుకోవాలని ఆయన సూచించారు. రైతులు తమ పంటను నష్టారహితంగా విక్రయించుకోవడానికి కేంద్రాలు కీలకంగా ఉంటాయని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండా కృష్ణవేణి, మాజీ వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకటరెడ్డి, ఏపీఎం నరహరి, సీసీ సైదులు, నాయకులు ముంగి శివమారయ్య, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గడ్డం గోవిందరెడ్డి, దుబ్బాకుల రాంరెడ్డి, మెరెడ్డి వెంకట రమణ, సోమనబోయిన శ్రీనివాస్, ఒంటెద్దు సునీత తదితరులు పాల్గొన్నారు.
చైర్మన్ అంకతి సత్యం రైతుల పంటలకు సరైన మార్కెట్ సౌకర్యాలను కల్పించడం ద్వారా రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ కేంద్రాల ద్వారా తక్కువ మార్జిన్, నాణ్యత పరీక్షలు, ప్రభుత్వ నిబంధనలు పాటించడం వంటి అంశాలు కూడా ఖచ్చితంగా అమలు కాబోతున్నాయని ఆయన చెప్పారు.









