తమిళ నటుడు అజిత్ నివాసానికి, చెన్నైలోని సత్యమూర్తి భవన్ ప్రాంతాలకు మంగళవారం బాంబ్ బెదిరింపులు వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చర్యలు తీసుకున్నారు. డిస్పోజబుల్ బాంబ్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీమ్ తో కలిసి మూడు గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
సెక్యూరిటీ ఆపరేషన్ అనంతరం, బెదిరింపు ఫోన్ కాల్ ఫేక్గా నిర్ధారించబడింది. ఈ ఘటన స్థానిక ప్రజలను కొంతకాలం భయపెట్టినప్పటికీ ఎలాంటి ప్రమాదం రాలేదు.
గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లు మరియు కార్యాలయాలకు బాంబ్ బెదిరింపులు రావడం సీరియస్ సెక్యూరిటీ సమస్యగా మారింది. పోలీసులు ప్రతి బెదిరింపుపై సీరియస్గా స్పందించి, సురక్షితంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
ఇలాంటి ఫేక్ బెదిరింపులు సామాజిక మాధ్యమాల్లో కూడా వ్యాప్తి చెందడంతో, ప్రజలకు భయభ్రాంతులు కలిగించకుండా, ప్రతి బెదిరింపును పరిశీలించి సకాలంలో చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం అని అధికారులు సూచిస్తున్నారు.









