వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముట్టిబోయ మునిరంగడు (35), కూలీ షికారి, వేట నిమిత్తం పొలంలో వెళ్ళినప్పుడు, పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మోమిన్పేట్ మండలం పరిధిలోని యూసుఫ్కి చెందిన సర్వే నంబర్(68) భూమి వద్ద సంభవించింది.
మోమిన్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వెంకట్ వివరించినట్లు, ఎన్కతల గ్రామానికి చెందిన గోపాల్ కౌలు తన పొలంలో పంటలు సాగు చేస్తున్నాడు. పంట రక్షణ కోసం విద్యుత్ తీగలను అమర్చడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
మృతుని అన్న ముట్టిబోయ రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు గోపాల్పై కేసు నమోదు చేశారు. సీఐ జి.వెంకట్, “పంటల రక్షణ పేరుతో పొలాల్లో కరెంటు షాక్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని హెచ్చరించారు.
మోమిన్పేట్, మర్పల్లి, నవాబుపేట్ మండలాల్లో ఇలాంటి అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన వారిపై సుమోటో కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా పొలాల్లో ఇలాంటి ప్రమాదాలున్నాయా అని జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉందని అధికారులు సూచించారు.









