మద్యం బానిసై పురుగుల మందు తాగిన రైతు మృతి

A farmer from Adilabad died by suicide after consuming poison following a quarrel with his wife over alcohol.

ఆదిలాబాద్ జిల్లా మండల పరిధిలోని మంకాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం వ్యసనంతో బాధపడుతున్న ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం — మంకాపూర్‌కు చెందిన నల్వాడ్ విట్టల్ వ్యవసాయ పనులు చేస్తూ జీవనాన్ని సాగించేవాడు. అయితే గత కొంతకాలంగా తాగుడుకు బానిసైపోయాడు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడటం రోజువారీ వ్యవహారంగా మారింది.

సోమవారం సాయంత్రం కూడా విట్టల్ మద్యం తాగి ఇంటికి చేరాడు. మరోసారి తాగడానికి డబ్బులు ఇవ్వమని భార్యను అడగగా, ఆమె డబ్బులు లేవని చెప్పింది. దీనిపై కోపం వచ్చిన విట్టల్ భార్యతో వాగ్వాదం చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తన పెదనాన్నకు ఫోన్ చేసి పురుగుల మందు తాగానని తెలిపాడు.

కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విట్టల్‌ను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share