వ్యవసాయం పర్యావరణ వ్యవస్థకు హాని కలిగించకుండా సహజ పంటలను పండించడంలో ఉత్తమ పద్ధతులను అవలంబించాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా **పప్పు ధాన్యాలపై జాతీయ మిషన్ “ధన్ ధాన్య కృషి యోజన”**ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్లోని నార్మ్లోని ఎం.ఎస్. స్వామినాథన్ ఆడిటోరియంలో శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, విద్యార్థులు వీక్షించారు.
ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయరంగానికి ప్రభుత్వం నిరంతరం బాసటగా నిలుస్తోందని, రైతుల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నార్మ్ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ వి. రామసుబ్రమణ్యం, డాక్టర్ రమేష్ నాయక్, రైతులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.









