డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రారంభం

New Geo-Sciences University offers global-level courses, research opportunities, and industry collaboration for students in Telangana.

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని భూ విజ్ఞాన రంగంలో ఒక మైలురాయి. నూతన యూనివర్శిటీ విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఏర్పాటైంది.

విద్యా కార్యక్రమాలు:
ప్రారంభ ఐదేళ్లలో బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియోఇన్ఫర్మేటిక్స్, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. డిప్లొమా/పీజీ డిప్లొమా మైన్ సేఫ్టీ, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ కోర్సులు కూడా ఉండనున్నాయి.

జియో ఏఐ కోర్ కరిక్యులమ్:
ఎంఐటీ నమూనా ప్రకారం, విద్యార్థులు కంప్యూటేషనల్ జియోసైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ లో కోర్ మాడ్యూల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ISRO, NRS Seal, Singareni Collieries, ONGC వంటి సంస్థల సహకారం తీసుకుంటారు.

ఉద్యోగులు:
ప్రారంభ దశలో 64 మంది బోధనా సిబ్బందిని నియమించనున్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించడానికి కనీసం 5 మంది ‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్’ ను నియమిస్తారు.

ఆర్థిక కేటాయింపులు (2025-26):
మొత్తం బడ్జెట్ రూ.1,306.756 లక్షలు, అందులో ప్రయోగశాలల కోసం రూ.195.793 లక్షలు, సివిల్ పనుల కోసం రూ.1,110.963 లక్షలు కేటాయించనున్నారు. నిధులు రాష్ట్ర, కేంద్ర గ్రాంట్లు, పరిశ్రమ భాగస్వామ్యాలు, విద్యార్థుల ఫీజులు, అంతర్జాతీయ గ్రాంట్లు, దాతృత్వం ద్వారా సేకరించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share