గంధసిరి ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్లు మంజూరు

Deputy CM Bhatti Vikramarka sanctioned ₹2 crore for the renovation of historic Gandhasiri temple, supporting local heritage.

మండల పరిధిలోని గంధసిరి గ్రామంలో ఉన్న కాకతీయుల కాలం నాటి శ్రీ సుందర మౌలేశ్వరస్వామి పురాతన ఆలయ పునర్నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం రెండు కోట్లు నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామస్తుల ఘన స్వాగతం పొందారు.

గ్రామస్తులు నిర్వహించిన ర్యాలీలో భట్టి విక్రమార్క పాల్గొని గుడి వద్ద భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ, పీపుల్ మార్చ్ పాదయాత్రలో గ్రామానికి చేరుకున్నప్పుడు ఆలయ పునర్నిర్మాణం అవసరమని తెలుసుకున్నట్టు వివరించారు. ఆ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిధులు మంజూరు చేశామని తెలిపారు.

భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ఉచిత కరెంట్, నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యేకంగా వివరించారు.

మధిర నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు వచ్చినా భట్టి విక్రమార్క ప్రజల బిడ్డగా నిలబడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, లోకల్ బాడీ కలెక్టర్, DRDO PD మరియు స్థానిక అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share