తెలంగాణ రాష్ట్రం తో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ఎంపికల్లో సీనియర్ నాయకులైన ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేక బాధ్యతలను కట్టబెట్టారు. ఈ క్రమంలో నిర్ణయాలు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా తీసుకోవడానికి సీనియర్ నేతలను ఇన్ఛార్జిలుగా నియమించారు.
తెలంగాణలో ప్రత్యేకంగా 22 మంది అబ్జర్వర్లను నియమించి, నియామకాల పారదర్శకతను పెంచడానికి చర్యలు తీసుకున్నారు. ఈ సీనియర్ అబ్జర్వర్లు స్థానిక స్థాయిలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి, నిర్ణయాల విషయంలో నిశ్పాక్షికతను చూసుకుంటారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోయే సమావేశంలో రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్తో పాటు పీసీచీ చీఫ్ మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొంటారు.

ఇవాళ సాయంత్రం అధికారులు ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ నెలాఖరున డీసీసీ అధ్యక్షులను అధికారికంగా ప్రకటించడానికి ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. మరోవైపు, జిల్లా అధ్యక్ష పదవుల కోసం అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసారు. ఇది పార్టీ అంతర్గతంగా ఉద్రిక్తతను సృష్టించింది, కానీ నియామకాల ప్రక్రియలో పారదర్శకతకు పాజిటివ్ సంకేతాలు అందుతోంది.









