ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో నర్సు ప్రియాంకా దాస్ హత్య సంఘటన సంచలనాన్ని సృష్టించింది. 23 ఏళ్ల ప్రియాంకా మృతదేహం గదిలో రక్తపు మడుగులో కనిపించింది. ఘటనకు లవ్ ట్రయాంగిల్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాల ప్రకారం, ప్రియాంకాకు దుర్గేష్ అనే యువకుడితో ఫ్రెండ్షిప్ ఉంది. మరోవైపు, గత ఏడేళ్లుగా సన్నీ అనే వ్యక్తితోనూ సంబంధం ఉంది. ముగ్గురి మధ్య జరిగే గొడవలే హత్యకు దారితీస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
స్నేహితురాలు ప్రియాంకను కలుసుకోగా, ఆమెను రక్తపు మడుగులో చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో మృతురాలి ఛాతీపై మూడు కత్తిపోట్లు గుర్తించబడ్డాయి. ఫోరెన్సిక్ బృందం విచారణను ప్రారంభించింది.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో పోలీసులు ఒక యువకుడిని అనుమానంగా అరెస్టు చేసి విచారిస్తున్నారు. మృతదేహం దగ్గర కత్తిని గుర్తించి, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రియాంక గత నెల రోజులుగా పచ్ పెడి నాకాలో రెంట్లో ఉండగా, ఎంఎంఐ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.









